Saturday, June 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలువివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ పై అవగాహన

వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ పై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: విద్యానగర్ లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రధానాచార్యులు డా. కె.ప్రభు ఆధ్వర్యంలో డ్రగ్స్ గురించి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు రిసోర్స్ పర్సన్స్ గా హైకోర్టు న్యాయవాది సుబ్బారావు, సిటీ సివిల్ కోర్టు న్యాయవాది సరోజా భాస్కర్ పాల్గొన్నారు. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ మహమ్మారిగా మారిందని, విద్యార్థులు డ్రగ్స్ వలన తమ జీవితాలను సర్వ నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ ను సేవించవద్దని, సమాజంలో ఎవరైనా సేవిస్తుంటే ఆ సమాచారం పోలీసులకు ఇవ్వాలని తెలిపారు.

డ్రగ్స్ వాడకంతో జీవితాలను నాశనం చేసుకున్న విద్యార్థులను ఉదాహరణలుగా తీసుకోవాలని వివరించారు. డ్రగ్స్ సేవించిన వారిపై NDPA యాక్ట్ మోపబడుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. కె.ప్రభు మాట్లాడుతూ… విద్యార్థులు భవిష్యత్తును బంగారు బాటగా మార్చుకోవాలంటే పుస్తకాలతో స్నేహం చేయాలన్నారు. డ్రగ్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని, సెల్ ఫోన్స్ కూడా డ్రగ్స్ లాగానే పనిచేస్తున్నాయని అన్నారు. కాబట్టి విద్యార్థులు వీలైనంతవరకు సెల్ ఫోన్స్ కు కూడా దూరంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు జీవిత లక్ష్యంతో చదువుకొని ఉద్యోగాలు సంపాదించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా యాంటీ డ్రగ్ ప్లెడ్జ్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డా.ఓ.పద్మజ, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. అనురాధ, డా.పుట్ట సుభాష్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -