నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : పంచాయతీ రాజ్ కమిషనర్ , జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ అభివృద్ధి సూచిక (పై 2.0)లో పేర్కొన్న అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు , మండల పంచాయతీ అధికారులు కి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో గ్రామీణాభివృద్ధికి సంబంధించి క్రింది తొమ్మిది ప్రధాన అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. పేదరికరహిత జీవనోపాధి కలిగిన పంచాయతీ, ఆరోగ్యకర పంచాయతీ, టీబీ ముక్త గ్రామ పంచాయతీ, త్రాగునీటి సరఫరాలో స్వయం సమృద్ధిగల పంచాయతీ, శుభ్రమైన, హరిత పంచాయతీ, స్వయం సమృద్ధిగల మౌలిక సదుపాయాల పంచాయతీ, సామాజికంగా న్యాయంగా రక్షణ పొందిన పంచాయతీ, మంచి పాలన కలిగిన పంచాయతీ, మహిళలకు అనుకూలమైన పంచాయతీ లపై గ్రామ స్థాయిలో మొత్తం 147 సూచికలు (బైనరీ – 65, న్యూమరిక్ – 82)పై శిక్షణ శిక్షణ ద్వారా అధికారులకు పంచాయతీ అభివృద్ధి సూచిక అమలు విధానాలపై అవగాహన కల్పించారు. జాతీయ స్థాయిలో మన జిల్లా గ్రామాలు ముందంజలో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి , జిల్లా పంచాయతీ అధికారి సునంద , మిషన్ భగీరథ ఈఈ పి కరుణాకర్ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా మనోహర్ , జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు , జిల్లా సివిల్ సప్లై అధికారి డి హరికృష్ణ , డిఎల్పిఓ బి శ్రీకాంత్ రెడ్డి, అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపిఓలు పాల్గొన్నారు.
పంచాయతీ అభివృద్ధి సూచికలపై అవగాహన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES