నవతెలంగాణ – కంఠేశ్వర్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాలలో భాగంగా గురువారం 8వ రోజు హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ సాగర్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం వల్ల పర్యావరణపై దాని దుష్ప్రభావం గురించి ప్రయాణికులకు అవగాహనా నిమిత్తం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సాధార్భంగా డివిజనల్ వైద్యాధికారి దీప మాట్లాడుతూ..ప్లాస్టిక్ బాగ్స్ వినియోగం పర్యావరణంపై ఎక్కువ దుష్ప్రబ్భావం చూపుతుంది. అని ప్లాస్టిక్ బాగ్స్ భూమిలో కలసిపోవుటకు సుమారు 10 నుండి 500 సంవత్సరాల కాలంపడుతుందని, ప్లాస్టిక్ బాగ్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసి పడ వేసిన కూడా జీవోదో కరణ చెందని స్వభావం వల్ల అది భూమిలో కలవదని అందువలన పర్యావరణ నికి ముప్పు ఎక్కువగా ఉంటుందని అదే విధంగా ప్లాస్టిక్ బాగ్స్ లో వినియోగించిన ఆహార పాదార్ధాలనూ చెత్తకుండిలలో వేయుట వలన మూగ జీవాలు తిని అనారోగ్య పాలు అవుతున్నాయని కావున ప్లాస్టిక్ బాగ్స్ వినియోగం స్వచ్చందంగా ప్రతిఒక్కరు జ్యూట్ లేదా గుడ్డ సంచిలని వినియోగించాలని ప్రయాణికులను అభ్యర్ధించారు. హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ సాగర్ ఈ సందర్బంగా ప్రయాణికులకు గుడ్డ తో చేసిన చేతి సంచులను అవగాహనా నిమిత్తం పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ సాగర్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, సీనియర్ ఇంజనీర్ సత్యనారాయణ,రైల్వే రక్షక దళ ఉప ఇన్స్పెక్టర్ హరిబాబు, సిబంది, హౌస్ కీపింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై అవగాహనా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES