- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్: పట్టణంలోని జిరాయితునగర్ అంగన్వాడి కేంద్రంలో సీజనల్ వ్యాధులపై, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించినారు. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ వెంకటరమణమ్మ మాట్లాడుతూ.. సీడీపీఓ ఆదేశానుసారం రోజువారి కార్యక్రమాల్లో భాగంగా చిన్నారుల తల్లులకు వర్షాకాలంలో ప్రభలే వ్యాధులపై, తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపినట్టు చెప్పారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు తగు జాగ్రత్తలు తీసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ఎస్తేరు రాణి, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు.
- Advertisement -