Saturday, June 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

భూభారతి చట్టంపై అవగాహన సదస్సు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు రెవిన్యూ సదస్సును నిర్వహించారు. స్థానిక  గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో తహసిల్దార్ గుడిమేల ప్రసాద్ భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. రైతులకు భూస్వాములు ఎలాంటి సమస్యలు లేకుండా తమ హక్కులను రిజిస్టరు చేసుకునే అవకాశం ఈ చట్టం కల్పిస్తోందన్నారు. గ్రామ స్థాయిలోనే డిజిటల్ రికార్డులు అందుబాటులో ఉండడం ద్వారా నూతన రెవిన్యూ చట్టం పారదర్శకత నిర్వహించబడుతుందన్నారు. ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. రెవిన్యూ సదస్సు సందర్భంగా భూ సమస్యలపై రైతుల నుండి 153 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి శరత్, పంచాయతీ కార్యదర్శి నరసయ్య, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -