- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలం అనంతారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారి డాక్టర్ యామిని శృతి ఆకస్మికంగా తనిఖీ చేశారు . రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. పల్లె దవాఖానలు అందుతున్న వైద్య సేవలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ అయినా బీపీ షుగర్ పేషెంట్లకు సకాలంలో మందులు ఇవ్వాలని, ఆమ్ సెంటర్లో 14 రకాల రక్త పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యామిని శృతి , డాక్టర్ మురళీమోహన్, విజయ, రేణుక, వసుధ, సురేష్ కుమార్, రమాదేవి, ఆశా కార్యకర్తలు శోభ లింగలక్ష్మి, కల్పన, విజయ, అరుణలు పాల్గొన్నారు.
- Advertisement -