నవతెలంగాణ – హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ఈరోజు తన శాఖల బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్లో కుటుంబ సభ్యుల సమక్షంలో, ముస్లిం మత పెద్దల ప్రార్థనల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయనకు కేటాయించిన మైనార్టీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల మంత్రిగా అధికారికంగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ గురుతర బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్కు పలువురు అధికారులు, నేతలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. గత నెల 31వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



