- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్పల్లి: ఈనెల 17న మండలంలోని తొర్లికొండ గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు పాల్గొంటారని జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కనకపురము తెలిపారు. కేశ పల్లి గ్రామ మాదిగ కుల సంఘ సభ్యులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, జక్రన్ పల్లి మండల ఉపాధ్యక్షులు విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ జక్రన్ పల్లి మండల అధ్యక్షులు వేల్పుల వరుణ్ మాదిగ పాల్గొన్నారు.
- Advertisement -



