నవతెలంగాణ – చేర్యాల : బక్రీద్ పండుగ త్యాగం, భక్తి, విశ్వాసానికి ప్రతీక అని మహ్మద్ ప్రవక్త బోధించిన సమైక్యతను, సోదర భావాన్ని అందరూ అనుసరించాలని జామియా మజీద్ అధ్యక్షులు మొహమ్మద్ ముఖీమ్, కార్యదర్శి మొహమ్మద్ ఆదిల్ లు అన్నారు. బక్రీద్ పండుగ పర్వదిన వేడుకలను శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రం తోపాటు మండల పరిధిలోని గ్రామాలలో ముస్లిం మైనార్టీ సోదరులు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్దనున్న ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేర్యాల పట్టణంతో పాటు పరిసర గ్రామాల ముస్లిం సోదరులు హాజరై ఒకరికొకరు ఈదుల్ అదా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నమాజ్ వేడుకల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చేర్యాల సీఐ ఎల్.శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ మాజీ అధ్యక్షులు బడే మియా, కమిటీ ఉపాధ్యక్షులు బబ్లు,సలహాదారులు హజ్జు, నాయకులు మొహమ్మద్ ఖాజా, కమిటీ సభ్యులు ఎక్బాల్ బాగన్, మొహమ్మద్ సలీం, నసీర్, తాహెర్, నసీర్ బిలాల్, ఫయీమ్ ఖురేషి, తన్వీర్శ, హనీఫ్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు.
బక్రీద్ పండుగ త్యాగం.. భక్తి, విశ్వాసానికి ప్రతీక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES