ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
నవతెలంగాణ – భూపాలపల్లి : త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈద్ ఉల్-అధా (బక్రీద్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాంబులగడ్డ, గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని ఈద్గా లల్లో జరిగిన బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ…. త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు బక్రీద్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. శాంతి, కరుణ, సహనం, సామరస్యం, ఐకమత్యం, సోదరభావం స్ఫూర్తితో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా భాగస్వామ్యం, దానధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం బక్రీద్ పండుగ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని సందేశాన్ని బక్రీద్ తెలుపుతుందన్నారు. బాంబులగడ్డ, చెల్పూర్ ఈద్గా లల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు దాట్ల శ్రీనివాస్, కురిమిల్ల రజిత శ్రీనివాస్, ముస్లిం పెద్దలు హాబీబ్ హఫీజ్, ఇర్ఫాన్ ఫయాజ్, యాకూబ్ ఖాన్, షఫీ, సాజిద్, అయూబ్ అన్వర్,హలీం, రఫీ, రహీంలతోపాటు ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES