– ముస్లింలు, ప్రజలకు కాసాని శుభాకాంక్షలు నవతెలంగాణ-హైదరాబాద్
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరిం చుకుని తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ రాష్ట్రం లోని ముస్లిం సోదర, సోదరీమణు లకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలి పారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతా వరణంలో ఆనందోత్సాహాలతో, సం ప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్ పుణ్యఫలంతో ప్రజలందరి మధ్య శాంతి సామరస్యం, సోదరభావం వెల్లివిరియాలనీ, అన్ని తరగతుల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్ధించారు. దాన ధర్మాల తో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో గురు వారం నాటి బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కాసాని జ్ఞానేశ్వర్ ఆకాంక్షించారు.