Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బంజారా సేవా మండల నూతన కార్యవర్గం

బంజారా సేవా మండల నూతన కార్యవర్గం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ మేరకు మండలంలోని అమీర్ నగర్ లో నిర్వహించిన మండల బంజారాల సమావేశంలో జిల్లా ఎన్నికల కమిటీ పర్యవేక్షకులు శర్మన్ నాయక్, మండల ఎన్నికల అధికారి లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా  బంజారా సేవా సంఘం మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల అధ్యక్షునిగా మార్కెట్ కమిటీ మాజీ  చైర్మన్ మలావత్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా  కోనాపూర్ తాజా మాజీ ఎంపీటీసీ సభ్యుడు లకావత్ గంగాధర్, ఉపాధ్యక్షులుగా నునావత్ లస్కర్ నాయక్, హపావత్ గోవింద్ నాయక్, కోశాధికారిగా రాథోడ్ సాగర్ నాయక్, సహాయ కార్యదర్శులుగా బాణావత్ మోతిలాల్ నాయక్, గుగులోతు భాస్కర్ నాయక్, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శిగా బనావత్ ధారా సింగ్ నాయక్, కార్యవర్గ సభ్యులుగా మాలావత్ సంగ్యా నాయక్, బాణావత్ రాములు నాయక్, మలావత్ రాజు నాయక్, ముఖ్య సలహాదారులుగా ధరంసోత్ మోహన్ నాయక్, మలావత్ రాములు నాయక్, గుగులోతు మంగ్త్యా నాయక్, తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి, పుష్ప గుచ్చాలను అందజేశారు. సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నందుకు తోటి బంజారాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బంజారాల అభివృద్ధికి తమ వంతుగా పాటుపడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చంద్రు నాయక్, దామోదర్ నాయక్, తండాల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -