- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గురువారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేద, బలహీనవర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యనందించేందుకు ఉపాధ్యాయులందరూ పనిచేయాలని అన్నారు. గురుకులాలు, వసతిగృహాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా ఉండేలా చూడాలని తెలిపారు. దోమల నుంచి విద్యార్థుల రక్షణ కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, వసతి సామగ్రి వెంటనే అందజేయాలన్నారు. విద్యార్థులందరికీ కాస్మెటిక్ ఛార్జీలు జమ చేసేందుకు బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలని సూచించారు. ప్రతి నెలా విద్యార్థుల ఎత్తు, బరువు తప్పక నమోదు చేయాలని అన్నారు.
- Advertisement -