- Advertisement -
నవతెలంగాణ – బిచ్కుంద
ఈనెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బూతులు, కౌంటింగ్ హాల్లను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఎన్నికల సామాగ్రి సక్రమంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలని పోలింగ్ సమయంలో ఎలాంటి అవంతరాలు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీస్ ప్రొటెక్షన్, మెడికల్, లైటింగ్, త్రాగునీటి ఏర్పాటు విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలని బార్కెట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వాతావరణం కల్పించాలని అధికారులకు ఆదేశించారు. తహసిల్దార్ వేణుగోపాల్, కమిషనర్ హయ్యుం, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ అధికారులు ఉన్నారు.
- Advertisement -



