Thursday, October 30, 2025
E-PAPER
Homeసినిమావాస్తవ ఘటన ఆధారంగా..

వాస్తవ ఘటన ఆధారంగా..

- Advertisement -

అఖిల్‌, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్‌ రాంబాయి’. ఈటీవీ విన్‌ ఒరిజినల్స్‌ ప్రొడక్షన్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్‌ ఫిలింస్‌, మాన్‌ సూన్స్‌ టేల్స్‌ బ్యానర్స్‌ పై వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకుడు. నవంబర్‌ 21న ఈ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌, బన్నీ వాస్‌ వర్క్స్‌ బ్యానర్స్‌ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్‌ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. బుధవారం ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది.
నిర్మాత బన్నీ వాస్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమా చూశాను. ఇది నా మనసుకు హత్తుకుంది. కొందరి లైఫ్‌లో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా చేశారు. ఇది కాల్పనిక కథ అయితే మనం ఆ దర్శకుడి ఊహకు ఆశ్చర్యపోయేవాళ్లం. ఇలా ఎలా ఆలోంచించారు అనుకునే వాళ్లం.

ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక ఎమోషనల్‌ ఫీల్‌తో వస్తారు’ అని అన్నారు. నటుడు చైతు జొన్నలగడ్డ మాట్లాడుతూ,’ఇది పక్కా తెలంగాణ సినిమా. తెలంగాణ నేటివిటీని, ఇక్కడి ప్రజల జీవితాలను ఈ చిత్రంలో చూస్తాం. ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్‌ రోల్‌ చేయడం హ్యాపీగా ఉంది’ అని చెప్పారు. డైరెక్టర్‌ సాయిలు కంపాటి మాట్లాడుతూ,’2016 నుంచి ఈ కథ పట్టుకుని తిరుగుతూ ఉన్నాను. ఒకే ఒక నెరేషన్‌లో వేణు ఊడుగుల మనం సినిమా చేస్తున్నాం అన్నారు. ఈటీవీ విన్‌ వారిని అప్రోచ్‌ అయితే వాళ్లకూ కథ నచ్చింది. అలా ఈ సినిమా టేకాఫ్‌ అయ్యింది. సురేష్‌ బొబ్బిలి మ్యూజిక్‌ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది’ అని తెలిపారు. ‘ఖమ్మం, వరంగల్‌ మధ్య జరిగిన ఓ రియల్‌ ఇన్సిడెంట్‌ ఆధారంగా ఈ చిత్ర కథను దర్శకుడు సాయిలు రాసుకున్నాడు.

ప్రేమతో కూడిన విషాదభరితమైన ఈ సంఘటన ఆ ఊర్లోనే జరిగి అక్కడే సమాధి అయ్యింది. దాన్ని బేస్‌ చేసుకుని సాయిలు ఒక మంచి స్క్రిప్ట్‌ రాశాడు. ఈ కథ విన్నప్పుడే కదిలించింది. ‘7జీ బృందావన్‌ కాలనీ, ప్రేమిస్తే, ఆర్‌ఎక్స్‌ 100, బేబి’ లాంటి చిత్రాల్లా తెలుగు ఆడియెన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. నా డైరెక్షన్‌లో యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయబోతున్నా’ అని ప్రొడ్యూసర్‌ వేణు ఊడుగుల చెప్పారు. నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ,”లిటిల్‌ హార్ట్స్‌’ మూవీ చేసిన వెంటనే మేము రిలీజ్‌ చేస్తున్న ప్రాజెక్ట్‌ ఇది. ఈ ఈవెంట్‌లో బ్యాండ్‌తో సౌండ్‌ చేశాం. నవంబర్‌ 21న అంతకంటే ఎక్కువ సౌండ్‌ చేస్తామని చెప్పగలను. ఈ సినిమా రిలీజ్‌ తర్వాత ఇందులోని చాలా మందిని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గుర్తుపెట్టుకుంటుంది’ అని అన్నారు. హీరోయిన్‌ తేజస్వినీ, హీరో అఖిల్‌, ఈటీవీ విన్‌ నితిన్‌, ఈటీవీ విన్‌ సాయికృష్ణ తదితరులు ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -