- Advertisement -
నవతెలంగాణ దుబ్బాక
దుబ్బాక పట్టణ కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో శనివారం బతుకమ్మ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ దాసరి రాజు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ రీడర్స్ కీసరి స్వామి, మరాటి స్వామి, భాష, నవీన్, శ్రావణి, దివ్య, భాగ్య, పలువురు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు.
- Advertisement -