- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ఆచార్య కొండా లక్ష్మణ్, ఉద్యానవన యూనివర్సిటీ, పసుపు పరిశోధన స్థానంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో పరిశోధన కేంద్రంలో పనిచేసే వ్యవసాయ కార్మికులు, వారి పిల్లలతో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. అనంతరం పరిశోధన కేంద్రం సమీపంలోని కుంటలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ముకేష్, శ్రీనివాస్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -