బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్.
నవతెలంగాణ – మల్హర్ రావు.
బిసి రిజర్వేషన్ 42 శాతం అమలు చేయాలని కోరుతూ రేపు రాష్ట్ర బిసి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే బంద్ కు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఆదేశాల మేరకు తమ మద్దతును ప్రకటిస్తూ,బంద్ విజయవంతం చేయాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి,యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్ శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు బీసీ వర్గాల హక్కుల కోసం, 42% రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ 42 శాతంకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ బంద్ ప్రకటించిందన్నారు.ఈ బంద్కు మండలంలోని అన్ని రాజకీయ పార్టీలు, వ్యాపారులు, షాప్ యజమానులు,ఆర్టీసీ, పాఠశాలలు,విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించి బంద్ను విజయవంతం చేయాలన్నారు.
బిసి బంద్ ను విజయవంతం చేయాలి.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES