– కార్యదర్శి బడుగు సైదులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర బీసీ గురుకుల విద్యా సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్) ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్ (ఆర్జేసీ) అడ్మిషన్లకు సంబంధించి రెండోదశ ఫలితాలు వెల్లడైనట్టు ఆ సంస్థ కార్యదర్శి బడుగు సైదులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ల ద్వారా పరిశీలించవచ్చని పేర్కొన్నారు.https://mjptbcwreis.telangana.gov.in, https://mjpabcwreis.cgg.gov.in గతేడాది వరకు ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లు కేటాయించగా, ఈ ఏడాది నుండి ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా, పదో తరగతిలో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. ఫలితాల్లో ఎంపికైన విద్యార్థులు తగిన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని, శుక్రవారం నుంచి తొమ్మిదో తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
బీసీ గురుకుల జూనియర్ కాలేజీల రెండో దశ ఫలితాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES