- Advertisement -
బిసి సంఘం మండల ఇంచార్జి జక్కం రాజేందర్
నవతెలంగాణ – మల్హర్ రావు
త్వరలో జరగనున్న జిల్లా పరిషత్, మండల ప్రజాపరిషత్ (జెడ్పిటిసి, ఎంపిటిసి) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సముచిన స్థానం కల్పించాలని జాతీయ బిసి సంఘం మండల ఇంచార్జి అధ్యక్షుడు జక్కం రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో బిసి జనాభా ఎక్కువ శాతం ఉన్నందున ప్రభుత్వం బిసి రిజర్వేషన్లు కల్పించి ఒక జెడ్పిటిసి, ఐదు ఎంపిటిసి స్థానాల్లో బీసీలకే అవకాశం కల్పించాలని కోరారు.
- Advertisement -



