- Advertisement -
జిల్లా పంచాయతీ సీఈవో శోభారాణి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
రాబోయే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల పనుల్లో ప్రతి అధికారి అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలని జిల్లా పంచాయతీ సీఈవో శోభారాణి ఆదేశించారు. శనివారం ఆమె ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి చేపట్టాల్సిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వార్డుల రిజర్వేషన్లు, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు సహా అన్ని కార్యక్రమాలు నిబంధనలకు అనుగుణంగా,పారదర్శకంగా సాగాలని సూచించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావులేదని ఆమె స్పష్టం చేశారు. సమీక్షలో ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, ఎంపీఓ అనురాధ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -


