- Advertisement -
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
రైతులు తమ పశువులకు సోకే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల పశువైద్యాధికారి పర్వీజ్ అహ్మద్ అన్నారు. గురువారం మండలంలోని దేగామా గ్రామంలో గొర్రెల్లో వచ్చే నీలి నాలుక వ్యాధి నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల్లో వచ్చే సీజనల్ వ్యాధులైన లంపి స్కిన్ ( ముద్ద చర్మ వ్యాధి) బ్ల్యూటంగ్ (నీలి నాలుక వ్యాధులపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం పశువుల్లో, గొర్రెలకు ఈ వ్యాధి నివారణ టీకాలను వేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -