Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

– మండల వైద్యాధికారి డాక్టర్ నరసింహస్వామి
– కమ్మర్ పల్లిలో ఫ్రైడే, డ్రై డే కార్యక్రమం  
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : వర్షాకాలం ఆరంభమైనందున గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రభలే ఆస్కారం ఉందని, ప్రజల అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి,కమ్మర్  పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నరసింహస్వామి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఫ్రైడే, డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించారు.ఆరోగ్య సిబ్బంది తో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.నీటి కుండిలను, పూల కుండీలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పనికి రాని టైర్లు, బకెట్లలో, ఖాళీ కొబ్బరి బొండాలలో నీళ్లు నిల్వ ఉంచకూడదన్నారు. ఖాళీ చేసి పనికి రాని వస్తువులను పడేయలని, కూలరులో ఉన్న నీళ్లను తీసివేసి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. లేదంటే వీటన్నింటి వలన రోజుల తరబడి నిల్వ ఉన్న నీటిలో లార్వా, దోమలు వృద్ధి చెంది ఆరోగ్యానికి హాని చేస్తాయని తెలిపారు.ప్రజలు కూడా సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రజలు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఆయా కాలనీల్లో మురికి కాలువలను పరిశీలించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad