Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

– తహసిల్దార్ గుడిమెల ప్రసాద్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : ప్రస్తుతం వానాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని తహసిల్దార్ గుడిమెల ప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి అధికారుల అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ ప్రసాద్ మాట్లాడుతూ వర్షాకాల సీజన్ ఆరంభమైనందున గ్రామాల్లో సీజనల్ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటించాలని, గ్రామంలో అన్ని మంచినీటి ట్యాంకులను నెలకు మూడుసార్లు తప్పనిసరిగా శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించారు.గ్రామాల్లో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా గుంతలను పూడ్చివేయాలన్నారు. మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, పరిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించాలని పంచాయతీ ప్రత్యేక అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. పైపులైన్ లీకేజీలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు.

ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ మాట్లాడుతూ… పంచాయతీ కార్యదర్శులు నీటి సరఫరా వ్యవస్థ పై దృష్టి పెట్టాలని, ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే తక్షణమే సంబంధిత శాఖల సహకారంతో మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. దోమల వల్లనే 90 శాతం సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని, దోమలు ఈగలు వ్యాప్తి చెందకుండా నీటి నిల్వ ప్రదేశాలపై దృష్టి సారించాలని అన్నారు. మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు రాత్రి పూట కుట్టే దోమల వల్ల వ్యాప్తి చెందుతాయని, డెంగ్యూ వ్యాధి పగటిపూట కొట్టే దోమల వల్ల వ్యాప్తి చెందుతాయని అన్నారు. దోమల నివారణకు నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని, మురికి గుంతలలో ఆయిల్ బంతులను వేయాలని అన్నారు. ప్రజలు దోమతెరలను వాడాలని దోమల నుంచి సురక్షితంగా ఉండాలని అన్నారు.

చిన్న అనారోగ్యం వచ్చిన వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి చికిత్స పొందాలని తద్వారా కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ నరసింహ స్వామి, చౌట్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ స్పందన, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అమీర్ ఖాన్, మిషన్ భగీరథ ఏఈ,  మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఐకేపి ఎపియం కుంట గంగాధర్, ఉపాధి హామీ ఏపీవో  విధ్యానంద్, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -