స్టాప్ డయెరియా” పై అవగాహన…
నవతెలంగాణ – డిచ్ పల్లి : సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ సూచించారు.సోమవారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి లో తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల కళాశాల లో “స్టాప్ డ యెరియా” కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎండాకాలం నుండి వర్షాకాలం మారుతున్న సీజన్ దృష్ట్యా సీజనల్ వ్యాధులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ మాట్లాడుతూ సీజన్ మారడం వలన సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వచ్చే సీజన్లో కొత్తనీరు చేరుతుందని, నీటిని కాచి వడపోసి త్రాగాలని, లేనిచో విరేచనాలు సంభవిస్తాయని విరేచనాలు అధికమైనట్లయితే ఓ. ఆర్.ఎస్ ద్రావణాన్ని వెంటనే తీసుకోవాలని, విరోచనాలు అధికమైనట్లయితే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొని రావాలని సూచించారు. విద్యార్థులు మూత్రశాలలు ఉపయోగించిన తర్వాత మరియు ఆహారం భుజించే ముందు చేతులు శుభ్రపరచుకునే విధానాన్ని వివరంగా పిల్లలకు వివరించారు. చేతులు శుభ్రపరచుకునే విధానాలు ఆరు రకాలుగా ఉంటాయని ఆ ప్రక్రియను విద్యార్థులచే ప్రాక్టీస్ చేయించారు. విద్యార్థులు రక్తహీనత కలవకుండా ప్రతిరోజు పాఠశాలలో ఇచ్చే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని పాలు,గుడ్లు , తాజా ఆకుకూరలు, కూరగాయలు బెల్లం పట్టిలు అధికంగా తీసుకోవాలని తెలిపారు. కౌమార దశలో బాలికలకు రక్తహీనత ఉన్నట్లయితే వారికి తొందరగా అలసట వస్తుందని గుండె దడ, తల తిప్పడం చదువుపై ఆసక్తి లేకపోవడం వంటి జరుగుతాయని కావున ప్రతి ఒక్కరూ ఐరన్ కలిగిన కూరగాయలు మునగ ఆకు మునగ కాడలు అధికంగా తీసుకోవాలని తెలిపారు. బి కాంప్లెక్స్ అధికంగా గల పల్లీలు బఠానీ గింజలు, శనిగలు అధికంగా తీసుకోవాలని తెలిపారు. అయోడిన్ కలిగిన ఉప్పును మాత్రమే వినియోగించాలని ప్రిన్సిపాల్ పద్మజకు ఆదేశించారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ పద్మజ, నర్సింగ్ ఆఫీసర్, ఆరోగ్య సిబ్బంది ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.
సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES