దాహన సంస్కారం నిర్వహించిన ఫారెస్ట్ అధికారులు..
నవతెలంగాణ – డిచ్ పల్లి : ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని తిర్మాన్ పల్లి గ్రామ అటవీ శివారు ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారి 44 నిజామాబాద్ నుండి కామారెడ్డి వెళ్ళే మార్గంలో గుర్తు తెలియని వాహనం ఢీకోని మృతి చెందింది. దాని వయసు దాదాపుగా 3 సంవత్సరాలు ఉంటుందని ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ తెలిపారు. మృతి చెందిన ఎలుగుబంటి కళేబరాన్ని తిర్మన్ పల్లి సెంట్రల్ నర్సరీకి తరలించి ఆదివారం పోస్ట్ మార్టం నిర్వయించి, దహన సంస్కరములు నిర్వహించారు. ఈ దహన సంస్కారానికి ఐఎఫ్ఎస్ నిజామాబాద్ డిఎఫ్ఒ వికస్ మీనా వెటర్నరీ అసిసెంట్ సర్జన్ డాక్టర్ గంగా ప్రసాద్, ఎన్.రాకేష్ , ప్రశాంత్ తోపాటు ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది పాల్గొన్నారు.
గత నేలలో చిరుత.. గత నెలలో రోడ్డు ప్రమాదంలో ఒక చిరుత మృతి చెందిన విషయం మరవకముందే మరోసారి జాతీయ రహదారి 44 పై ముడెళ్ళ వయస్సు గల ఎలుగుబంటి మృతి చెందింది. మృత్యువాతలకు కారణం ఏమై ఉంటుందని పలువురు అవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి కి ఇరువైపుల ఇనుప కంచె లేకపోవడంతోనే జంతువులు అటవీ ప్రాంతంలో ఇక్కడి నుండి ఇంకో చోటికి రాకపోకలు సాగించే సమయంలో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటూందని దినికి ఇదే కారణమని చేప్పుకుంటున్నారు. ఇదే కాకుండా గతంను పరిశీలిస్తే ఇంకా ఎన్నో రైలు కింద, వాహనాల కింద చిరుతలు, ఎలుగుబంటి తదితర వచ్చి మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఏది ఏమైనాప్పటికీ రాదారికి ఇరువైపులా కంచి ఏర్పాటు చేసి జంతువులు మృత్యువాత పడకుండా ప్రభుత్వం, జాతీయ రహదారి అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.