దుమ్ము దూళి, కాలుష్యం, చెడు జీవనశైలి, కెమికల్ ఆధారిత సౌందర్య ఉత్పత్తుల వాడకం కారణంగా చర్మం క్రమంగా తన మెరుపును కోల్పోతుంది. ముఖం అందంగా ఉండాలంటే చాలా మంది పార్లర్లకు వెళ్లి ఖరీదైన బ్యూటీ ట్రీట్మెంట్లు తీసుకుంటుంటారు. కానీ హానికరమైన రసాయనాల వల్ల చర్మం దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో మెరిసే చర్మం కోసం ఆలుగడ్డ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో స్కిన్ కేర్ను ముఖంపై ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
ఆలుగడ్డ, పెరుగు
– ముందుగా ఆలు గడ్డను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి.
– రెండు చెంచాల పెరుగు, చిటికెడు పసుపు వేసి కలపాలి.
– ఇప్పుడు ముఖంపై సుమారు 10-15 నిమిషాల పాటు ఉంచి ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో ముఖాన్ని బాగా కడగాలి.
– దీన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయడం వల్ల మెరిసే, మచ్చలేని చర్మం సొంతమవుతుంది.
ఆలు, అలోవెరా
– ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో రెండు చెంచాల అలోవెరా జెల్ తీసుకోవాలి.
– అందులో రెండు చెంచాల ఆలూ రసం కలపండి.
– ఈ పేస్ట్ను ముఖంపై 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఆరిన తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.
– దీన్ని వారానికి రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల చర్మం మదువుగా, మెరుస్తూ ఉంటుంది.
ఆలూతో అందం..
- Advertisement -
- Advertisement -