దండకారణ్యం తుపాకుల గర్జనతో దద్దరిల్లుతున్నది. మావోయిస్టులతో పాటు గిరిజనుల నెత్తురు ఏరులై పారుతున్నది. ఆరు నెలలుగా ఏకధాటిగా కొనసాగుతున్న కూం బింగ్ ఆదివాసీ గూడాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. చిన్న అలికిడి జరిగినా, బూట్లచప్పుడు వినిపించినా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ‘మావోయిస్టు రహిత భారత్’ కోసమంటూ చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ నిజంగా నక్సల్స్ను నిర్మూ లించడం కోసమేనా? అదే నిజమైతే ఆదివాసులను అడవుల నుంచి తరిమేయడం దేనికి? యథేచ్ఛగా మానవ హక్కుల్ని ఉల్లం ఘిస్తూ చేస్తున్న ఈ మారణ హోమం వెనుక ఉన్న ఉద్దేశమేంటి? ప్రజల్లో ఉద్భవిస్తున్న ఇలాంటి ప్రశ్నలకు కేంద్ర సర్కార్ సమాధానం చెప్పగలదా? ఎందుకంటే, స్వాతంత్య్రం వచ్చిన ప్పటి ప్రభుత్వాలెన్నో మారినా మునుపెన్నడూ లేని విధంగా దేశంలో రాజ్యహింస పెచ్చరి ల్లింది. దీనికి కారణా లేంటని లోతుగా పరిశీలిస్తే, అడవుల్లో మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్న ఖనిజ నిక్షేపాలు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు అప్పనంగా అటవీ సంపదను దోచిపెట్టేందుకే ఈ నరమేధం. ‘ఖనిజ’ వేట అందులో భాగమే!
ఛత్తీస్గఢ్ బొగ్గు, ఇనుము, సున్నపు రాయి, డోలమైట్, బాక్సైట్ నిక్షేపాలకు ప్రసిద్ధి. దేశంలో టిన్ ఖనిజాన్ని ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రం ఇదే. లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదపై దేశ బడా కార్పొరేట్ల కన్నుపడింది. అత్యున్నత స్థాయి గ్రేడ్ ఇనుప ఖనిజం (హెమటైట్) ను వారికి కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం ఒప్పందం కూడా చేసుకుంది. ఈఏడాది జన వరిలో ఏడువేల ఎకరాల్లో నాలుగు పదమూడవ ఖనిజ బ్లాకుల వేలానికి సిద్ధమైంది. అయితే ఈ ఖనిజ తవ్వకాలతో ఎక్కువ నష్టం జరిగేది అక్కడ నివ సించే ఆదివాసులకే. అడవివి, వారిని విడదీసి చూడలేము. ఈ తెగలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు సర్కార్లు చేయని కుట్రలేదు. కొంతమంది అలా వెళ్లినవారికి ఆశ్రయం కల్పించింది అంతకన్నా ఏమీలేదు.
అందుకే ఆదివాసులు ఎన్నికష్టనష్టాలు ఎదురైనా అడవిని వదిలిపెట్టరు. పైగా ఇది మావోయిస్టులకు కూడా ఆసరాగా మారింది. ముందు మావోయిస్టులను నిర్మూలిస్తే, ఆదివాసులు వారంతావారే వెళ్లిపోతారని పాలకుల భావన! నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, కర్రెగుట్టల ప్రాంతాల్లో జరిగిన, జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ ఆ కోవకు చెందినవే. ఇప్పటికే మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు సహా చాలామంది చనిపోయారు. అయితే ఈ ఎన్కౌంటర్లకు కోవర్టులు, పోలీసుల నిఘా వ్యవస్థలే కారణం కానీ, అక్కడున్న ఆదివాసులు ఎంతమాత్రం కాదు. అత్యాధునిక యంత్రాలతో సీఆర్పీఎఫ్, కోబ్రా బెటాలియన్, డీఆర్డీఓ సహా ఇరవై నాలుగు వేలమంది జవాన్లు మావోయిస్టుల కోసం సెర్చ్ చేస్తున్నారు. ఆపరేషన్ కగార్ ఇక మావోయిస్టులకు ఆఖరి మజిలీ అంటూ మీడియాలో, మాధ్యమాల్లో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ‘2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత భారత్’ నిర్మిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్షా మాటల వెనుక దాగున్న ‘ఆంతర్యం’ కూడా ఇదే. అయితే, ఇది చివరిదా, మొదటిదా అనే చర్చకన్నా భారతదేశ ప్రజల హక్కుగా, వారి అభివృద్ధికి ఉపయోగపడాల్సిన ఖనిజాలను బహుళ జాతి సంస్థలకు అప్పగించే చర్యల్ని వ్యతిరేకించడంతో పాటు అడ్డుకోవడం ముఖ్యం.
ఛత్తీస్గఢ్ ఒక్కటే కాదు, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ లతో మొత్తం పది రాష్ట్రాలను నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా కేంద్రం గుర్తించింది. ఆదివాసుల సహకారం లేకుండా చేయడం, మావోయిస్టుల ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టడం లాంటి రెండంచెల పోరుతో కేంద్రహోం శాఖ వ్యూహం రచించింది. అందులో భాగంగానే ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సంకల్ప్తో అడవుల్ని జల్లెడ పడుతూ ఎన్కౌం టర్లకు తెగబడుతోంది. పోలీసులు చేస్తున్నవవి బూటకపు ఎన్కౌంటర్లేనని చేస్తున్న పౌరహక్కుల వాదనల్ని తేలిగ్గా కొట్టి పారేయలేం! ఎందుకంటే, మావోయిస్టులతో శాంతి చర్చలకు అంగీకరిం చాలని వామ పక్షాలు సహా, రాజకీయ పార్టీలు, చేసిన వినతిని కేంద్ర హోంమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి తిరస్కరించి మరీ హత్యలకు పూను కోవడం సహేతుం కాదు. ఆపరేషన్ కగార్ ఆదివాసీలు లేదా మావోయిస్టులకు సంబంధిం చిన సమస్యగా చూడకూడదు. ఇది ప్రాథమిక మానవతా, ప్రజా సమస్య. ఇది పర్యావరణ న్యాయానికి, దేశ సంపదకు ముడిపడిన సమస్య. అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం కండ్లముందే సజీవ సమాధి అవుతుంటే దాన్ని ప్రశ్నించకూడదనదనడం ఏం న్యాయం?
నరమేధం వెనుక…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES