Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ 

బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ 

- Advertisement -

జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ 
నవతెలంగాణ – పరకాల 

బుధవారం ఎస్ఎఫ్ఐ పరకాలమండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా అధ్యక్షత మడికొండ ప్రశాంత్ మండల అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు మూడేళ్లగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాలలు లేఖలు రాశారు. దీనివల్ల పాఠశాలలో చదువుతున్న 23 వేల మంది దళిత విద్యార్థులు 7వేల మంది గిరిజన విద్యార్థులు చదువు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు. 154 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. గత ఆరు నెలలుగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలు విడుదల చేయాలన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులతో మరియు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, విజయ్, అన్వేష్, రాకేష్, కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -