- Advertisement -
విప్లవాత్మక భారత స్వతంత్ర సమరయోధుడు
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని పోసానిపేటలో ఆదివారం రెయిన్బో యూత్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118 వ జయంతి వేడుకలను నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ…. భగత్ సింగ్ విప్లవాత్మక భారత స్వాతంత్ర సమరయోధుడని, దేశభక్తిని యువత అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు టంకరి రవి, బండి పోచయ్య, శ్రీకాంత్, బండి నరసింహులు, సుతారి సత్యం, గాజుల రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -