రఫ్ నోట్ ప్రొడక్షన్ పతాకంపై రాజ్ తరుణ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం రూపొం దుతున్న విషయం తెలిసిందే. ఇందులో ‘ప్రేమిస్తే’ భరత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజరు మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ‘కాదల్, పట్టియల్, కాళిదాస’్ వంటి చిత్రాలలో తన విభిన్న నటనతో పేరు తెచ్చుకున్న భరత్ ఈ సినిమాలో ఎమోషనల్, ఎనర్జీ ఉన్న పాత్రను పోషిస్తున్నారు. కథను ముందుకు నడిపించే కీలక పాత్రగా భరత్ కనిపించనున్న ఈ పాత్ర అందర్ని అలరించే విధంగా ఉంటుంది. తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ చేరికతో ఈ ద్విభాషా చిత్రానికి పాన్ సౌత్ ఇండియన్ రేంజ్ వచ్చినట్లు అయిందని చిత్ర యూనిట్ తెలిపింది. దర్శకుడు విజరు మిల్టన్ మాట్లాడుతూ,’భరత్ ఎంతో నిబద్దత గల నటుడు. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర కథలో ఎంతో ఇంపార్టెంట్. కథను మలుపు తిప్పే ఈ పాత్ర ఆయన కెరీర్కు కూడా ఎంతో ప్లస్ అయ్యే విధంగా ఉంటుంది’ అని తెలిపారు. ఈ సినిమాలో ఇప్పటికే ఆసక్తికరమైన తారాగణం భాగమవుతోంది. నటుడు ఆరి తన కెరీర్లో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండగా, రాజ్ తరుణ్ తమిళంలోకి అడుగుపెడుతున్నారు. అలాగే సంగీత దర్శకుడు పాల్ డబ్బా నటుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పుడు భరత్ చేరికతో ఈ కాంబినేషన్ మరింత బలపడింది. సామాజిక నేపథ్యం కలిగిన, గాఢమైన భావోద్వేగ కథనాన్ని అందించడంలో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచే విజరు మిల్టన్ ఈ చిత్రంలో కూడా అదే స్థాయిని చూపించబోతున్నారని తెలుస్తోంది. వైవిధ్యమైన కథతో భారీ తారాగణంతో తెరకెక్కతున్న ఈ ద్విభాషా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
కీలక పాత్రలో ‘ప్రేమిస్తే’ భరత్
- Advertisement -
- Advertisement -