- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని స్కూల్ తాండ, జగదాంబ తండా తోపాటు బట్టు తాండ స్టేజీల వద్ద భీంగల్ ఎక్స్ప్రెస్ బస్సును ప్రయాణికుల సౌకర్యార్థం ఆపాలని సోమవారం తాండవాసులు కామారెడ్డి డిపో మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. అందజేసిన వారిలో బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సల్లావత్ బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ గంగావత్ రాజు నాయక్, తండావాసులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -