- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం తెల్లవారుజామున భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా భోగి వేడుకలను తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉదయం 4.30 గంటలకు పూజలు చేసి భోగి మంటను జాగృతి నాయకులు వెలిగించారు. ఈ సందర్భంగా భోగి మంట వద్ద నాయకులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. గంగిరెద్దులకు పూజలు చేశారు. హరిదాసులకు భిక్ష ప్రదానం చేశారు.
- Advertisement -



