- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నరేష్ ప్రారంభించి ఇండ్ల పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసుకుని ప్రభుత్వం నుండి లబ్ధి పొందాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు యాదవ్, కమిటీ సభ్యులు రవీందర్, బాలయ్య, నర్సింలు, స్వామి, పంచాయతీ కార్యదర్శి బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -