ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అభివృద్ధి పనులు
నవతెలంగాణ – పెద్దకోడప్ గల్ : రాష్ట్రములో మారుమూల గ్రామాల్లో సైతం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతుందని మండల కాంగ్రెస్ అధ్యక్షులు పారుపల్లి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విట్టల్ వాడి తండా లో 20 లక్షల నిధులతో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయానికి మరియు రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు భూమి పూజ చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మారుమూల గ్రామాల్లో సైతం సీసీ రోడ్డు, మురికి కాలువలు, ఇంద్రమ్మ ఇల్లు, గ్రామపంచాయతీ భవనాలు, ప్రజలు కావాల్సిన మౌలిక వసతులను కల్పిస్తూ అభివృద్ధి చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ శ్రీకాంత్ రెడ్డి,పంచాయతీ కార్యదర్శి హరీష్, మండల కాంగ్రెస్ నాయకులు చిప్ప మోహన్, జాగిర్ నాయక్, విట్టల్ వాడి తండా ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ భవనం కోసం భూమి పూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES