- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాల మేరకు మండలంలోని తుర్కలపల్లి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేయడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొమ్మ కంటి రాములు మాట్లాడుతూ పేదోడికి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చుతుందన్నారు. కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బొమ్మ కంటి కృష్ణయ్య, జిల్లా జనరల్ సెక్రెటరీ మహేందర్, దశరథ, సత్తయ్య, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు జగన్, బొడ్డు శీను, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -