- Advertisement -
నవతెలంగాణ – రెంజల్: రెంజల్ మండలం తాడి బిలోలి గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎంపీడీవో వెంకటేష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబీన్ ఖాన్ లు భూమి పూజ చేశారు. ఈ గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి 42 మంది లబ్ధిదారులకు ఇంటి పత్రాలను అందజేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు జి సాయి రెడ్డి, జావీద్ ఉద్దీన్, రామాలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, బి రవి, లక్ష్మణ్, యోగేష్ పాటిల్, గ్రామ కార్యదర్శి రాఘవేందర్ గౌడ్ , క్షేత్ర సహాయకులు మధు, కారోబార్ అనంతరావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -