నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం అల్లాపురం గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి రెవెన్యూ చట్టాన్ని చౌటుప్పల్ డివిజన్ ఆర్డిఓ వి.శేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మంగళవారం ప్రారంభించారు. గ్రామంలో నెలకొన్న భూ సమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరిస్తామని శేఖర్ రెడ్డి ప్రజలకు సూచించారు.అనంతరం చౌటుప్పల్ మున్సిపాలిటీ తాళ్ల సింగారంలో భూభారతి రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ బి.వీరాబాయి డిప్యూటీ తాసిల్దార్ సిద్ధార్థ కుమార్ అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాణాల రాంరెడ్డి మండల సర్వేయర్ మురళీధరన్ కాంగ్రెస్ పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్ అల్లాపురం మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.
అట్టహసంగా ప్రారంభమైన భూభారతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES