- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో భూభారతి అమలులో భాగంగా జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల వద్దకే రెవెన్యూ నినాదంతో తహసీల్దార్ బృందాలు గ్రామాల్లో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తాయి. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపులు జతచేయడం కొత్త విధానమని, రెండు నెలల్లో 6,000 మంది సర్వేయర్లను నియమిస్తామని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -