- Advertisement -
నవతెలంగాణ – జన్నార
భూ భారతి రెవెన్యూ సదస్సు గురువారంతో అన్ని గ్రామాల్లో ముగిశాయని మండల తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి డిప్యూటీ తాసిల్దార్ రామ్మోహన్ రావు అన్నారు. ఆదివారం మండలంలోని బొబ్బెన గ్రామంలో భారతీ రెవెన్యూ సంస్థలు నిర్వహించారు. సందర్భంగా గ్రామంలో రైతులు ఇచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఇప్పటివరకు అన్ని గ్రామాల్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులలో మొత్తం 565 దరఖాస్తులు వచ్చాయన్నారు. మండల కేంద్రంలో పరిష్కారం అయ్యే వాటిని పరిష్కరించి ఇక్కడ పరిష్కారం కాని వాటిని జిల్లా కేంద్రానికి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గంగరాజా, భానుచందర్ రెవెన్యూ అధికారులు రైతులు ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -