నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే.. మరోవైపు మెరుగైన సమాజ స్థాపనకు కృషి చేస్తుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని విద్యార్ధులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. వందల కోట్ల రూపాయల ఖర్చుతో.. అత్యాధునిక సౌకర్యాలతో నూతన పాఠశాలలు ప్రారంభించడానికి రెడీ అయ్యింది. ఇదిలా ఉండగా తాజాగా రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది.
ఆర్థిక కారణాల వల్ల టాలెంట్ ఉన్న విద్యార్థులు ఎవరూ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీఎం ఓవర్సీస్ పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పేద, మధ్య తరగతి మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తుంది. వారు విదేశాల్లో చదువుకోడానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. దీని ద్వారా అర్హులైన మైనారిటీ విద్యార్థులు.. ప్రపంచంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఉచితంగా చదువుకోవచ్చు.
మైనారిటీల ఉన్నత చదువులకు సాయం చేయడం కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఫర్ మైనారిటీస్ పథకం కింద ఎంపికైన 500 మంది మైనారిటీ విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తారు. ఈ పథకానికి ఎంపికైన మైనారిటీ విద్యార్థులు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. అయితే కొన్ని సందర్బాల్లో.. ప్రభుత్వం రూ. 20 లక్షలు లేదంటే విద్యార్థి అడ్మిషన్ లెటర్ మీద ఎంత ఫీజు ఉంటే అంత మొత్తం భరించడానికి రెడీ అవుతుంది. అంతేకాక వారు విదేశాలకు వెళ్లడానికి కావాల్సిన ఫ్లైట్ టికెట్ను కూడా ప్రభుత్వంమే ఉచితంగా అందస్తుంది.
మైనారిటీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. దీనికి అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ జులై 8 2025న ప్రారంభం అవుతుంది. అప్లికేషన్లకు చివరి తేదీ ఆగస్టు 7, 2025 వరకు ఉంటుంది.
ఈపథకానికి అప్లై చేసుకునేవారు తమ ఆధార్ కార్డు, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఫోన్ నంబర్, మార్కుల మెమో, మైనారిటీ సర్టిఫికేట్, పాస్ ఫోటోలు వంటివి అవసరం.
దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర నివాసితులై ఉండాలి. ఇస్లాం, సిక్, క్రిస్టియన్, బౌద్ధ, జైన, పార్సి వర్గాలకు చెందిన విద్యార్థులు మాత్రమే అర్హులు. గ్రాడ్యుయేషన్లో కనీసం 60% మార్కులు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల లోపు ఉండాలి. పీజీ లేదా పీహెచ్డీ కోర్సులకు ప్రఖ్యాత యూనివర్సిటీ లేదా కళాశాలలో ఆఫర్ లెటర్ పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 35 సంవత్సరాల లోపు ఉన్నవారు ఇందుకు అర్హులు.
విద్యార్థులకు భారీ శుభవార్త..ఒక్కొక్కరికి రూ.20 లక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES