- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అక్టోబర్ 19 నుంచి టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ సిరీస్కు ముందే ఆతిథ్య ఆసీస్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక ప్లేయర్, కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. కమిన్స్కు వెన్నెముకలో నొప్పి ఉందని, ఈ కారణంగానే న్యూజిలాండ్, భారత్తో జరిగే సిరీస్లకు దూరంగా ఉంటాడని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది.
- Advertisement -