- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. తొలి దశ ఎన్నికల పోలింగ్ నవంబరు 6న జరగడనుంది. బీహార్లోని 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ఈ స్థానాలకు నవంబర్ 6న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరగనుంది. చివరి రోజున ఎన్డీఏ, మహాగట్బంధన్తో పాటు ఇతర పార్టీల స్టార్ క్యాంపెయినర్లు, సీనియర్ నేతలు ర్యాలీలు, రోడ్షోలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి తుది ప్రయత్నాలు చేశారు.
- Advertisement -

                                    

