- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్:హనుమకొండ జిల్లా కమలాపూర్ (M) లక్ష్మీపూర్ వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శనిగరంలో స్నేహితుడి అంత్యక్రియలకు హాజరై అక్కడి నుంచి కమలాపూర్కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులు శనిగరానికి చెందిన వట్టెంల నాగరాజు (20), బండి వినయ్ (18)గా గుర్తించారు.
- Advertisement -



