- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ ఆఫ్షోర్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ దిగ్గజం ‘బైండ్జ్’ తన కార్యకలాపాలను విస్తరించినట్టు ప్రకటించింది. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో తమ రెండవ డెలివరీ సెంటర్ను ప్రారంభించినట్టు వెల్లడించింది. ఆఫ్షోర్ ఫైనాన్షియల్ అడ్వైజరీ, కంప్లైయన్స్ సేవలకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఈ వ్యూహాత్మకంగా కొత్త సెంటర్ను ప్రారంభించామని బైండ్జ్ కన్సల్టింగ్ ఎండీ, సీఈఓ శిరీష్ కొరడా తెలిపారు. ”ఈ విస్తరణ మా క్లయింట్కు తక్షణ ప్రతిస్పందనాత్మక, స్కేలబుల్ డెలివరీని అందించడంలో మా నిబద్ధతకు ప్రతిబింబించనుంది.” అని అన్నారు.
- Advertisement -