Thursday, June 26, 2025
E-PAPER
Homeఖమ్మం"బయో చార్" తో నేలకు ఆరోగ్యం,పర్యావరణ పరిరక్షణకు సహజ పరిష్కారం

“బయో చార్” తో నేలకు ఆరోగ్యం,పర్యావరణ పరిరక్షణకు సహజ పరిష్కారం

- Advertisement -

– వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రవికుమార్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట
పెరుగుతున్న కాలంతో పాటు సమాజంలో సంభవించే సాంకేతిక మార్పులకు అనుగుణంగా ప్రతీ రంగంలో మనిషి తన జీవన గమనాన్ని,వృత్తిపరంగా నూతన విధానాలను అలవర్చుకోవాల్సి ఉంటుంది. పారిశ్రామిక రంగం అయినా,వ్యవసాయ రంగం అయినా పర్యావరణం పరిరక్షణ దిశగా మనిషి మారకుంటే జీవజాలం మనుగడే ప్రమాదంగా మారే అవకాశం ఉంది.

రసాయన ఎరువులతో అధిక దిగుబడులు సాధించినప్పటికీ ఆ రసాయనాలు తో నేల కలుషితం అయి భవిష్యత్తులో సాగు కే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ,సారవంతం అయిన నేల రూపొందించాలంటే మన పూర్వీకులు సాగుచేసిన విధానం కొంతైనా ఉంది.అందులో భాగమే ఈ బయో చార్ తయారీ,వినియోగం.

ప్రస్తుత మన కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆలోచన మేరకు తానే స్వయంగా వ్యవసాయం పై దృష్టి సారించి సేంద్రియ విధానంలో వ్యవసాయ సాగు ను ప్రోత్సహిస్తుండటం హర్షణీయం. అంతే గాకుండా బయో చార్ కు సంబంధించి ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో బయో చార్ తయారీ,వినియోగం పై వ్యవసాయ శాఖ అశ్వారావుపేట నియోజక వర్గ సహాయ సంచాలకులు పి.రవికుమార్ తెలిపిన విశ్లేషణ పూర్వక కధనం.

ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సోదరులు అధిక దిగుబడి సాధించే ప్రయత్నంలో అధిక రసాయనాలను వినియోగించడం వలన నేలలోని సేంద్రియ కర్బన శాతం నానాటికి క్షీణించడంతో నేలలోని సూక్ష్మజీవుల సంఖ్య తగ్గడంతో పాటు నేల భౌతిక స్థితి మారి నిస్సారంగా తయారవుతుంది.ఇలాంటి పరిస్థితుల్లో నేలను మరలా సారవంతంగా తయారు చేయడంలో ఉపయోగించే వివిధ పద్ధతుల్లో ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలో ఉన్న పద్ధతి పంట పొలాల్లో బయో చార్ ఉపయోగించడం. ఈ బయో చార్ ను పంట కోత అనంతరం ఎండిన అవశేషాల నుంచి తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2.02 లక్షల ఎకరాల్లో పత్తి,83 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంట కోత అనంతరం పత్తి కట్టె,మొక్కజొన్న చొప్పను తగలబెట్టడం కాల్చే స్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిని కాల్చుట వలస సూక్ష్మజీవులు నాశనం అవ్వడం తోపాటు  సేంద్రియ పదార్థం నాశనం అవుతుంది. ఈ పరిస్థితుల్లో మన జిల్లాలో లభ్యమయ్యే పత్తి,మొక్కజొన్న పంట వ్యర్థాలను ఉపయోగించి బయో చార్ తక్కువ ఖర్చుతో తయారు చేసుకొని భూమి ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు సూక్ష్మజీవులు నాశనం కాకుండా కాపాడుకోవచ్చు.ఈ బయో చార్ ని పిట్ విధానము, డ్రమ్ విధానము లేదా ఫర్నేస్ విధానం ఉపయోగించి తయారు చేస్తారు.కానీ చిన్న సన్న కారు రైతులు పిట్ విధానాన్ని అవలంబించి తమ దగ్గర ఉన్న వనరులతో తయారు చేసుకోవచ్చు. మిగతా పద్ధతులతో పోల్చితే ఈ విధానంలో తయారీకి ఖర్చు తక్కువ,రైతు స్వతహాగా తన పొలంలోనే తయారు చేసుకోవచ్చు.
బయో చార్ తయారీ విధానం (పీట్ విధానం):

మొదటి దశ: భూమిలో పొడిగా ఉన్నచోట మొదటగా 2 నుంచి 3 అడుగుల లోతు,2 అడుగుల వెడల్పు, అవసరమైనంత (4 నుండి 6 అడుగుల) పొడవు లో గుంత తవ్వాలి.

రెండవ దశ : ఎండిన పత్తి, మొక్కజొన్న కాండాలు ను చిన్న ముక్కలుగా చేసి గుంటలో వేసి పై నుంచి నిప్పు పెట్టాలి. మధ్య మధ్యలో తగిన ఆక్సీజన్ తో కాలే టట్టు చూసుకోవాలి,ఈ వ్యర్ధాలను పూర్తిగా కాలి పోకుండా సగం కాలే అంత వరకు ఉంచాలి.

మూడో దశ: వ్యర్ధాలు సగం కాలిన తర్వాత పైనుంచి నీరు పోసి నిప్పు పూర్తిగా చల్లార్చిన తర్వాత బయో చార్ బయటకు తీసి పొడిచేసి నిల్వ చేసుకోవాలి.

నాలుగో దశ :సాధారణంగా వ్యర్థాల నుంచి 20 నుంచి 40 శాతం వరకు బయో చార్

 తయారు చేసుకోవచ్చు.

మోతాదు: ఉద్యాన పంటల కైతే 1 నుంచీ 3 కేజీల చొప్పున ఒక మొక్క కు,ఆహార పంట అయిన వరి కి అయితే 250 నుంచి 300 కేజీలు ఒక ఎకరానికి చొప్పున ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.

బయో చార్ వలన ఉపయోగాలు

1. సూక్ష్మ జీవుల సంఖ్య పెరుగుతుంది.

2. నేలలోని సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుతుంది

3. నేల భౌతిక లక్షణాలు మెరుగుపడతాయి

4. భూసారం పెరుగుతుంది.

5. పేడు వ్యవస్థ త్వరగా అభివృద్ధి చెందుతుంది.తేమను నిల్వ ఉంచుతుంది

7. లవణాలు,ఖనిజాలు మొక్కకి లభ్యమగు స్థితిలోకి మారుతాయి.

8. ఎరువుల వినియోగాన్ని 460 శాతం వరకు తగ్గించుకోవచ్చు.

9. పర్యావరణానికి మేలు చేకూరుతుంది.

10. పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంది.

అయితే ఈ బయో చార్ తో నేలకు ఎంతో మేలు ఉన్నప్పటికీ దీన్ని నేరుగా వాడటం మంచిది కాదు.పశువుల పెంట తో కానీ ఘన,ద్రవ జీవామృతం లో 15 రోజులపాటు కలియబెట్టి బయో చార్ ను మాత్రమే ఎరువుగా వాడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -