Friday, June 20, 2025
E-PAPER
Homeఖమ్మంఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుట్టిన రోజు వేడుకలు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పుట్టిన రోజు వేడుకలు

- Advertisement -

భావి భారత ప్రధాని రాహుల్ గాంధీయే – కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాంబాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
: రాబోవు కాలంలో భావి భారత ప్రధాని రాహుల్ గాంధి యే నని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మ రాంబాబు ఆకాంక్షించారు. పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రాంబాబు నేతృత్వంలో రాహూల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా బర్త్ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు స్వీట్ లు పంచారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు పాలిస్తున్నాయని కులం, మతం పేరిట చిచ్చు పెడుతున్నాయన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తు, అదేవిధంగా దేశ సంపదను విచ్ఛిన్నకర శక్తుల చేతిలో పెడుతున్నారని ఆయన విమర్శించారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ వేలాది కిలోమీటర్లు భారత్ జోడోయాత్ర చేపట్టి దేశానికి ఒక దిక్సూచిగా నిలిచారని కొనియాడారు.

భవిష్యత్తులో భారత దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ లాంటి వారు ఎంతో అవసరమని,రాహుల్ గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలను చేసి ఈ దేశాన్ని కాపాడు కుంటుందని త్యాగాల మయ మైన ఈ కుటుంబాన్ని ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని,రాహుల్ గాంధీ లాంటి నిస్వార్ధపరులైన వారు ఈ దేశాన్ని ఏలితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని,దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావడం ఖాయం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక  పీఏసీఎస్ అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ,ముల్లగిరి క్రిష్ణ,నండ్రు రమేష్,వేల్పుల సత్యనారాయణ యాదవ్,నార్లపాటి సోమయ్య, మూర్తుజా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -