కేంద్ర మంత్రులు సంజయ్, కిషన్రెడ్డి
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి..
ఇక రాజకీయ ముఖచిత్రంలో
బీఆర్ఎస్ పార్టీ ఉండదు : మీడియాతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
‘బీజేపీ- బీఆర్ఎస్ వేర్వేరు కాదు. కవిత ఇష్యు కల్వకుంట్ల కుటుంబ కుంపటి. ఆస్తి పంపకాల్లో తేడాలు వచ్చి రోడ్డున పడ్డారు. ఇకమీదట రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. కవిత చెప్పిన కొన్ని విషయాలు వాస్తవాలే. బీజేపీ- బీఆర్ఎస్ ఒప్పందాన్ని కవిత బయట పెట్టింది. వీటికి బీఆర్ఎస్ – బీజేపీ నాయకత్వం జవాబు చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజరు ఇంకా యువ మోర్చా నాయకుడిలాగా మాట్లాడుతున్నారు. ముందు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వేసిన ప్రశ్నలకు కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి’ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని వద్ద శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి ఆదివాసీ నాయకుల శిక్షణ కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ మొదలు రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ గిరిజన, ఆదీవాసీ హక్కులను కాపాడుతూనే ఉందన్నారు. లంబాడ, కోయ, గోండులను ఆదుకోవాలనే ధ్యేయం కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. అందుకే ఆదివాసీ శిక్షణా తరగతులను ఏర్పాటు చేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అభివృధ్ది, సంక్షేమంలో స్పష్టత ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. బీజేపీ పదేండ్లుగా అధికారంలో ఉన్నా అవినీతిని ఆపలేకపోయిందన్నారు. బీజేపీ కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యిందన్నారు. బీజేపి- బీఆర్ఎస్ లోపాయికార ఒప్పందంతో ప్రజా ధనాన్ని దోపిడీ చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం, మహబూ బాబాద్ ఎంపీలు రామసహాయం రఘురాం రెడ్డి, పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, మట్టా రాగమయి, రాందాస్ నాయక్, తదితరులు హాజరయ్యారు.
బీజేపీ- బీఆర్ఎస్ ఒప్పందం కవిత బట్టబయలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES