సికిల్ సెల్ వ్యాధి లేదా సికిల్ సెల్ అనీమియా లేదా కొడవలి కణ రక్తహీనత అనేది వంశపారంపర్యంగా సంక్రమిస్తున్న రక్త రుగ్మత. సాధారణంగా మనిషి రక్తంలోని ఎర్రరక్త కణాలు గుడ్రంగా పెప్పెర్మింట్ల ఆకారంలో ఉంటాయి. ఈ కణాలు రక్తనాళాల ద్వారా శరీరమంతా ప్రయాణిస్తూ వివిధ అవయవాలకు ఆక్సిజన్ను సరఫరా చేస్తుం టాయి. అయితే కొంతమందిలో జన్యుసంబంధ మార్పుల వల్ల ఎర్ర రక్త కణాలు కొడవలి (సికిల్) ఆకారంలోకి మార్పు చెందుతాయి. ఈ సికిల్ సెల్ ఉన్నవారి రక్తకణంలోని ఒక జన్యువు సికిల్ సెల్ గానూ, ఒకటి మామాలుగానూ ఉన్నట్లయితే అటు వంటి వారిని సికిల్ సెల్ క్యారియర్లు అంటారు. వీళ్లకి మామూలుగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే వివాహం చేసుకున్న దంపతులకు ఇటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వారికి పుట్టిన పిల్లలకు రక్తకణంలోని రెండు జన్యువులూ వంపు తిరిగి ఉంటాయి. అటువంటి పిల్లలకు పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. సాధారణ రక్త కణాల జీవితకాలం 120 రోజులైతే సికిల్ సెల్ రక్త కణాల జీవిత కాలం 20 నుంచి 25 రోజులు మాత్రమే. సికిల్ సెల్ రక్త కణాల జీవిత కాలం తక్కువగా ఉండడం వలన, వేగంగా కొత్త ఎర్రరక్త కణాలు ఉత్పత్తి కాకపోవడంతో ఈ వ్యాధి కలిగిన వారు రక్తహీనతకు గురవుతారు. అంతేకాక సికిల్ సెల్ రక్తకణాలు వంపుతిరిగి ఉండటం వల్ల రక్తనాళాల్లో రక్తం సరిగ్గా ప్రవహించలేక శరీర భాగాలకు ఆక్సిజన్ అందటం తగ్గిపోతుంది. అందువల్ల ఈ వ్యాధి ఉన్నవారు తగిన చికిత్స తీసుకోకపోతే చిన్న తనంలోనే చనిపోతారు. ఈ వ్యాధి కలిగిన వారి సగటు జీవిత కాలం 42-48 సంవత్సరాలు. జన్యుపరమైన మార్పుల వలన ఏర్పడుతున్న ఈ రక్తహీనత జబ్బుకు సరైన మందులు లేవు.
సికిల్ సెల్ వ్యాధిని ప్రజా ఆరోగ్య సమస్యగా గుర్తించాలని 2008 డిసెంబర్ 22న జరిగిన ఐక్య రాజ్య సమితి 63వ జనరల్ అసెంబ్లీ ప్లీనరీ సమావేశం ప్రత్యేకంగా తీర్మానించింది. సికిల్ సెల్ డిసీజ్ పై ప్రపంచ దేశాలన్నీ ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవ సరమైన చర్యలు తీసుకోవాలని ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలను ఆదేశించింది.2009 నుండి ప్రపంచ దేశాలన్నీ జూన్ 19న అంతర్జాతీయ సికిల్ సెల్ డిసీజ్ దినోత్సవాన్ని జరుపుతూ ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాయి. మన దేశంలో 17 రాష్ట్రాల్లో సికిల్ సెల్ డిసీజ్ సుమారు ఇరవై లక్షల మంది కలిగి ఉన్నారని అంచనా. 2020 నాటికి సికిల్ సెల్ అనీమియా అనే జన్యు పరమైన వ్యాధిని కలిగిన వారిలో ఉన్న రక్తహీనత నిర్మూలించడానికి 2018లో కేంద్ర ప్రభుత్వం ”అనీమియా ముక్త్ భారత్” కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ నిర్దేశించిన లక్ష్యాన్ని 2025 నాటికి కూడా చేరుకోలేదు. 2023-24 బడ్జెట్ సందర్బంగా ప్రవేశపెట్టిన మిషన్ మోడ్-2047 పథకం అమ లులోనూ నిర్లక్ష్యం కనిపిస్తున్నది. సికిల్ సెల్ అనీమియాతో పాటు రక్త రుగ్మతలు, రక్తాన్ని ప్రభావితం చేసే అనేక రకాల వ్యాధులను నివారిం చడానికి కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో 40 ఏండ్ల లోపు వయస్సు కలిగిన ఏడు కోట్ల మంది గిరిజనులకు 2025-26 నాటికి ప్రత్యేకంగా వ్యాధి నిర్ధారణ కోసం స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించింది. ప్రపంచలోనే వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో మన దేశంలో రెండో స్థానంలో ఉంది. ఏడాదికి సుమారు 40వేల మంది పిల్లలు ఈ వ్యాధితో పుడుతున్నారని అంచనా. ప్రతియేటా 50శాతం మంది పిల్లలు ఐదేండ్లకంటే ముందే చనిపోతున్నారు.
”తల్లిదండ్రులిద్దరిలో సికిల్ సెల్ హిమోగ్లోబిన్ లక్షణాలు ఉంటే ఈ వ్యాధి ఒక తరం నుండి మరొక తరానికి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారతదేశంలోని అధిక రాష్ట్రాల్లో ఈ వ్యాధి నివారణకు ప్రత్యేక నివారణ ప్రాజెక్టులను చేపట్టారు. ఛత్తీస్గఢ్లో ప్రత్యేక పరిశోధనాలయం కూడా ఉంది. ఈ వ్యాధి నివారణకు, దీనిపై పరిశోధనకు రారుపూర్లో ప్రత్యేకంగా సికిల్ సెల్ ఇన్స్టిట్యూట్నే నెలకొల్పి 12.43 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. 2008లో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులు అధికంగా ఉండే 12 జిల్లాల్లో సికిల్ సెల్ అనీ మియా కంట్రోల్ ప్రాజెక్టును చేపట్టింది. గుజరాత్ లో 18.28 లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు జరిపి జబ్బుతో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించి, సికిల్ సెల్ క్యారియర్ల మధ్య వివాహాలు జరగకుండా వారిని చైతన్య పరచి మంచి ఫలితాలు సాధించారు. కేరళలో ఈ వ్యాధి బారిన పడినవారికి వైద్య ఖర్చుల కోసం రూ.20 వేలు ఇస్తున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి ఆర్థిక సహాయం చేయడం లేదు.ఈ వ్యాధి నిర్ధారణ ప్రాథమిక పరీక్షను ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలోనే జరపవచ్చు.సికిల్ సెల్ వ్యాధి చికిత్సకు సరైన మందులు లేనందున, సికిల్ సెల్ క్యారియ ర్లను గుర్తించి వారి మధ్య వివాహాలను నిరోధించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధిని త్వరి తంగా నివారించాలని, నివారించకపోతే దుష్పరిణామాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా పాలకులు ఏమాత్రం పట్టిం చుకోవడం లేదు. ఇప్పటికైనా మిషన్ మోడ్ 2047 సికిల్ సెల్ డిసీజ్ నిర్మూలనకు దోహదపడేవిధంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.
– ఎం.అడివయ్య,9490098713
రక్త రుగ్మతను అరికట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES