Friday, June 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన శిబిరం..

ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన శిబిరం..

- Advertisement -

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు.
నవతెలంగాణ – కామారెడ్డి
: ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14 ను పురస్కరించుకుని శనివారం రోజున ప్రభుత్వ వైద్యశాలలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ సేవాదళ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలోని పేషంట్ల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్ లు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు, జమీల్ లు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 304.7 మిలియన్ యూనిట్ల రక్తం అవసరం ఉండగా 272.3 మిలియన్ యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉందని దీని వలన సకాలంలో రక్తం దొరకక చాలా మంది ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది అని అన్నారు.2025 ప్రపంచ రక్తదాతల దినోత్సవం నినాదంగా  రక్తదానం చేద్దాం ఆశను పంచుకుందాం, కలిసి మనం ప్రాణాలను కాపాడుకుందాం అనే నినాదంతో ముందుకు సాగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు చేసింది అని అన్నారు. జూన్ 14న ఉదయం 09 గంటల నుండి మధ్యాహ్నం 01 గంటల వరకు శిబిరం ప్రభుత్వ వైద్యశాల కామారెడ్డిలో కొనసాగుతుంది అని అన్నారు.రక్తదానం చేసిన ప్రతి రక్త దాతకు ప్రశంస పత్రాలను,కీ చైన్ ను అందజేస్తామని తెలియజేశారు.రక్తదానం చేయాలనుకున్న రక్తదాతలు ఈ నెంబర్లను 9492874006,8897349872 సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్షక్ బి.ఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ కె రషీద్,కామారెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -